మానుగూరు, 1 July
జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా మణుగూరు వాసవీక్లబ్ ఆధ్వర్యంలో 100 పడకల ఆస్పత్రి, శివలింగాపురం పిహెచ్సీ వైద్యులను బుధవారం ఘనంగా సన్మానించారు. నిరుపేదలకు వైద్య సేవలు అందిస్తున్న వైద్యుల సేవలు వెలకట్టలేనివని క్లబ్ అధ్యక్షుడు శ్యామ్ కొనియాడారు.
మణుగూరు:జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మణుగూరు వాసవీక్లబ్ ఆధ్వర్యంలో 100 పడకల ఆస్పత్రి, శివలింగాపురం పిహెచ్ సీ వైద్యులను బుధవారం ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు శ్యామ్ మాట్లాడుతూ... ఏజన్సీ ప్రాంత ఏరియాలలో నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలందించి ఇక్కడి ప్రజలకు అందుబాటులో ఉంటున్న వైద్యుల సేవలు గుర్తు చేశారు. సమాజానికి నిరంతరం నిస్వార్ధ సేవలందిస్తూ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ప్రధాన భూమిక పోషిస్తున్న వైద్యుల సేవలు వెలకట్టలేనివన్నారు. సేవాభావంతో పనిచేసే ప్రతి వైద్యుడు సమాజానికి ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు దోసపాటి నాగేశ్వరరావు, ఐపిసీ లు బండారు నర్సింహారావు, కడవెండి విశ్వనాథగుప్తా, చిట్టూరి శేషుబాబు, వాసవీ క్లబ్ ప్రతినిధులు వడియాల ప్రభాకర రావు, గౌరీ శంకర్, సుగ్గల సూర్యం, మోహన్ రావు, సముద్రాల కృష్ణమూర్తి, వనమా లక్ష్మీనారాయణ గుప్తా తదితరులు ఉన్నారు.











