పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం మణుగూరులో అనారోగ్యంతో బాధపడుతున్న తెలంగాణ ఉద్యమకారుడు అక్కినపల్లి సైదులు (75) నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
మణుగూరు మండల పరిధిలోని 220 కెవి సబ్స్టేషన్ ప్రాంత నివాసి, నిజం న్యూస్ రిపోర్టర్ సత్యనారాయణ తండ్రి అయిన అక్కినపల్లి సైదులు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్వయంగా సైదులు నివాసానికి చేరుకుని, ఆయన ఆరోగ్య స్థితిగతులపై ఆరా తీశారు. సైదులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని వైద్య సహాయం అందిస్తామని, కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఉద్యమంలో సైదులు చేసిన సేవలను ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, సైదులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.








