
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని అయ్యప్ప నగర్ కాలనీలో రోడ్ల మరమ్మతులు, సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని కాలనీవాసులు మున్సిపల్ అధికారులకు వినతి పత్రం అందించారు. అమృత్ సంస్థ వారు పైపులైన్ పనుల కోసం తవ్వేసిన రోడ్లను సరిచేయాలని వారు కోరుతున్నారు. కాలనీలో రహదారుల విషయంలో వివక్ష చూపుతున్నారని వాపోయారు.



















