సిద్దిపేట, జూలై 24
తెలంగాణ రాష్ట్ర మాజీ ఐటి మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కంటెస్టెడ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు హుస్నాబాద్ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కేటీఆర్ ను ప్రశంసిస్తూ, ఆయన దీర్ఘాయుష్షును ఆకాంక్షించారు.
తెలంగాణ రాష్ట్ర మాజీ ఐటి మంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు జన్మదిన వేడుకల సందర్భంగా, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కంటెస్టెడ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు శుక్రవారం హుస్నాబాద్ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా పిడిశెట్టి రాజు మాట్లాడుతూ, కేటీఆర్ ఆధునికత కార్యాచరణలో చిత్తశుద్ధి, ప్రజాసేవలో అంకితభావం, పాలనలో ప్రగతి పథం యువతరానికి ఆదర్శమని కొనియాడారు. తెలంగాణ భవితకు ఆశాకిరణం, గులాబీ దళపతి, ప్రజల ఆశల రథసారథి అయిన కేటీఆర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏస్ రమేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.












