
మణుగూరులోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి మంజూరైన ఆర్థిక సహాయం చెక్కును ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు లబ్ధిదారునికి అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న పినపాక మండలం జనంపేట గ్రామానికి చెందిన బలుగురి నాగేశ్వరరావుకు ఈ చెక్కును అందించారు.



















