
తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మణుగూరు భద్రాది థర్మల్ విద్యుత్ కేంద్రం వద్ద విద్యుత్ సవరణ బిల్లు 2025 మరియు ప్రైవేటీకరణకు సంబంధించిన చట్ట సవరణలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం జరిగింది.

తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మణుగూరు భద్రాది థర్మల్ విద్యుత్ కేంద్రం వద్ద విద్యుత్ సవరణ బిల్లు 2025 మరియు ప్రైవేటీకరణకు సంబంధించిన చట్ట సవరణలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం జరిగింది.

కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, పాత 29 కార్మిక చట్టాలను యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేపట్టాయి. మణుగూరు ఏరియాలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని, తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.

మణుగూరు ఏరియాలో అక్రమ ఫైనాన్స్ మాఫియా, అధిక వడ్డీ వ్యాపారాలు పేద, మధ్యతరగతి ప్రజలను దోచుకుంటున్నాయని రేణుక అక్షర మహిళా మండలి ఆరోపించింది. వెంటనే వీటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరులో ఫిబ్రవరి 15, 2026న నిర్వహించనున్న శ్రీశ్రీశ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి కార్యక్రమానికి పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లును నిర్వాహకులు ఆహ్వానించారు.

సార్వత్రిక సమ్మె నేపథ్యంలో మణుగూరు సింగరేణి ఏరియాలో కార్మిక సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. పలువురు నాయకులు ప్రదర్శనల్లో పాల్గొని, కొన్ని విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో ఇసుక లారీ బీభత్సం కొనసాగుతోంది. బుధవారం ఉదయం ములకపాడు ఎక్స్ రోడ్డు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మహిళ అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు కొత్తగూడెం, ఇల్లందు, అశ్వరావుపేట మున్సిపాలిటీల పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి, పోలింగ్ సరళిని పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు.